నేడు పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు

Source: www.sakshi.com

Posted by: ID on 24-09-2016 00:17, Type: Commentary/Human Interest , Zone: South Central Railway)

గుంటూరు (నగరంపాలెం) : సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్యలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాకు పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున శనివారం డివిజను పరిధిలో పలు రైళ్లు రద్దు చేశామని, మరికొన్ని దారి మళ్లించామని గుంటూరు రైల్వే డివిజను సీనియర్‌ డివిజనల్‌ మేనేజరు కె.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్‌ పరిధిలో 17 రైళ్లను రద్దు చేయగా 23 రైళ్లను న్యూగుంటూరు, గుంతకల్, ఖాజీపేట, మీదుగా దారిమళ్లించినట్లు పేర్కొ న్నారు. ట్రైన్‌ నం 57619 రేపల్లె–సికింద్రాబాద్, ట్రైన్‌lనం 57620 కాచిగూడ– రేపల్లె డెల్టా ప్యాసింజరు, ట్రైన్‌ నం 12795/12796 విజయవాడ– సికింద్రా బాద్‌– విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలును యథావిధిగా నడుపుతున్నట్లు పేర్కొన్నారు.